Showing posts with label GST News. Show all posts
Showing posts with label GST News. Show all posts

Sunday, March 15, 2020

india-Mobile-phones-to-cost-more-as-GST-rate-hiked
సెల్ ఫోన్ మీద జీఎస్టీ బాదుడు..ఎంత పెరగనుందంటే?

సెల్ ఫోన్ మీద జీఎస్టీ బాదుడు..ఎంత పెరగనుందంటే?

మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా మారింది మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని చూస్తుంటే. ప్రభుత్వం తనకు వచ్చే పన్ను ఆదాయాన్ని పెంచుకోవటానికి.. తనకున్న అన్ని అవకాశాల్ని విపరీతంగా వాడేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 34 డాలర్లకు పరిమితమైనప్పటికీ.. పెట్రోల్.. డీజిల్ ధరలపై లీటరుకు మూడు రూపాయిల చొప్పున పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని మర్చిపోకూడదు.

ఇలాంటి బాదుడు మరిన్ని ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా జీఎస్టీ మండలి సరికొత్త నిర్ణయాల్ని ప్రకటించింది. సెల్ ఫోన్లపై ఇప్పటివరకు ఉన్న పన్ను భారాన్ని పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. సెల్ మరింత ఖరీదు ఎక్కనుంది.

కలకలం రేపుతున్న కరోనా పుణ్యమా అని.. చైనాలో చోటు చేసుకున్న పరిణామాలతో సెల్ ఫోన్ ధరలకు రెక్కలు వచ్చాయి. కనిష్ఠంగా ఐదు వందల నుంచి గరిష్ఠంగా మూడు.. నాలుగు వేల వరకూ ధరల్లో మార్పులు రాగా.. తాజాగా జీఎస్టీ మండలి ఏకంగా ఆరు శాతం పన్ను పోటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.

తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ప్రతి వందకు రూ.6 చొప్పు.. వెయ్యికి రూ.60 చొప్పున కొత్త భారం పడనుంది. పదివేల రూపాయిల ఫోన్ మీద కొత్త పన్ను ప్రకారం రూ.600 అదనపు భారం పడనుంది. నిత్యవసర వస్తువుగా మారిన సెల్ మీద పన్ను పోటును పెంచేయటమే కాదు.. సెల్ ఫోన్ విడిభాగాల మీదా పన్ను భారాన్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

Saturday, February 1, 2020

New-GST-from-April-Month.jpg

ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ.. పన్ను ఎంతంటే?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన జీఎస్టీ వసూళ్ల పై కీలక ప్రతిపాదనలు చేశారు. జీఎస్టీ ఒకే దేశం.. ఒకే పన్ను విధానం మంచి ఫలితాన్ని ఇచ్చిందని నిర్మల పేర్కొన్నారు.

ఇక ఈ కోవలోనే ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం అమలు చేస్తామని నిర్మల ప్రకటించారు. దీని వల్ల ప్రజలపై పదిశాతం వరకూ పన్ను భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

జీఎస్టీ వల్ల గత రెండేళ్లలోనే కొత్తగా 16లక్షల మంది పన్ను చెల్లింపు దారులు పెరిగారని నిర్మల పార్లమెంట్ లో ప్రకటించారు. ఏకంగా 40 కోట్ల మంది పన్ను రిటర్న్ ఫైల్ చేశారని ఇది తమ ఘనతగా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జీఎస్టీ పన్ను ఆదాయం పెరుగుతుందని.. జీఎస్టీ రిటర్న్స్ మరింత సులభతరం అయ్యిందన్నారు.

జీఎస్టీ వసూలు జనవరి రూ.1.1 లక్షల కోట్లు దాటాయని నిర్మల పార్లమెంట్ లో ఘనంగా ప్రకటించారు. 2019 జనవరి ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి ఆదాయం 12శాతం వృద్ధిని కనబరిచిందని తెలిపారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన 2017 నుంచి లక్ష కోట్లు దాటడం ఇది రెండోసారి కావడం విశేషం.

Recent Posts